దేశంలోని 595 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2013-14 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది.
అర్హతలు:ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతుండాలి. విద్యార్థి 2000 మే 1 నుంచి 2004 ఏప్రిల్ 30 (రెండు తేదీలు కలిపి) మధ్య కాలంలో జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు, బాలికలకు ప్రాంతాల వారీగా రిజర్వేషన్లు ఉంటాయి.
ఎంపిక:ప్రవేశ పరీక్ష ద్వారా. ఇది పూర్తి ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. దీన్లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 2 గంటల సమయం కేటాయిస్తారు. నోట్: ఒక్కసారి పరీక్షకు హాజరైన వారికి రెండోసారి రాసే అవకాశం లేదు.
ప్రయోజనాలు:పరీక్షలో అర్హత సాధించి 6వ తరగతిలో చేరిన విద్యార్థికి 12వ తరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తారు. బాల, బాలికలకు విడివిడిగా వసతి సౌకర్యం ఉంటుంది. విద్యా బోధనతోపాటు వసతి, ఆహారం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్ ఉచితంగా ఇస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో శిక్షణ ఉంటుంది. వీటితోపాటు క్రీడలు, యోగా, ఎన్సీసీ, సంగీతం, చిత్రకళ తదితర రంగాల్లో కూడా శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ విద్యతోపాటు, వీశాట్, ఎడ్యుసొసైటీ కనెక్టివిటీ, ఇంటర్నెట్, లైబ్రరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
ఫీజు:ఓసీ, బీసీ వర్గాలకు చెందిన ఉన్నత ఆదాయ వర్గ బాలురు మాత్రమే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఫీజు నిమిత్తం నెలకు రూ.200 చెల్లిచాల్సి ఉంటుంది.
దరఖాస్తు:అన్ని వివరాలతో దరఖాస్తును పూర్తిచేసి సంబంధిత మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో సమర్పించి రశీదు పొందాలి.
ముఖ్యమైన తేదీలు: * చివరి తేదీ: అక్టోబరు 1. * రాత పరీక్ష తేదీ: 2013 ఫిబ్రవరి 10.